Tomorrow Job fair: రేపు జాబ్ మేళా
ఈనెల 9న సుస్వదీప్ అగ్రో కంపెనీ పార్వతీపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా ఉపాధి కల్పన అధికారి ఆర్.వహిదా తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆరోజు ఉదయం 10 గంటల నుంచి నిర్వహించనున్న జాబ్మేళాకు హాజరయ్యేందుకు 10వ తరగతి నుంచి డిగ్రీ పాసైన అభ్యర్థులు వయస్సు 18–40 ఏళ్ల వయస్సు కలిగి ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు.
సేల్స్ ఎగ్జిక్యూటివ్, బ్రాంచ్ ఇన్చార్జ్, గొడౌన్ ఇన్చార్జ్, డెలివరీ బోయ్స్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, కేవలం పురుష అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూలు ఉంటాయని స్పష్టం చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఎన్సీఎస్. జీఓవీ.ఇన్ వెబ్సైట్లో నమోదు చేసుకుని బయోడేటా, రెండు పాస్పోర్ట్ ఫొటోలతో హాజరు కావాలని కోరారు.
#Tags