ఆగస్టు 12న మెగా జాబ్‌ మేళా

Mega job fair

తిరువళ్లూరు: మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆగస్టు 12న తిరువళ్లూరు జిల్లా పట్టాభిరామ్‌లోని హిందూ తెలుగు మైనారటీ కళాశాలలో భారీ జాబ్‌మేళా నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కార్మిక సంక్షేమ శాఖ మంత్రి సీవీ గణేషన్‌, కమిషనర్‌ వీరరాఘవరావు, కలెక్టర్‌ ఆల్బీజాన్‌వర్గీష్‌, ఎమ్మెల్యే నాజర్‌ తదితరులు పరిశీలించారు. జాబ్‌మేళాకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు మౌలిక సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు. అనంతరం మంత్రి గణేషన్‌ మీడియాతో మాట్లాడుతూ జాబ్‌మేళాకు 150 పైగా బడా కంపెనీలు హాజరుకావడంతో పాటు 30 వేల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉందన్నారు. ఈ జాబ్‌మేళాలో ఐటీఐ, డిప్లామా, నర్సింగ్‌ , ఫార్మసీ, ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన అభ్యర్థులు పాల్గనవచ్చని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే జాబ్‌మేళాలో పాల్గొనాలని సూచించారు. కాగా అవకాశాలను పొందని వారికి తాము శిక్షణ సైతం ఇస్తామన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

#Tags