IIT New Courses: ఐటీఐలో కొత్త కోర్సులు.. ఈ తేదీ లోగా దరఖాస్తు చేసుకుంటే వారి ఫీజులు ప్రభుత్వమే చెల్లిస్తుంది

నారాయణపేట: ఐటీఐలో కొత్తగా ఆరు కోర్సులు ప్రవేశపెట్టిందని, ఈ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా లేబర్‌ అధికారి మహేశ్‌కుమార్‌ అక్టోబర్ 16న ఒక ప్రకటనలో తెలిపారు.

అక్టోబర్ 19 వరకు దరఖాస్తు చేసుకుంటే వారి ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

చదవండి: Government Jobs: పల్లెల్లో సర్కారీ కొలువులపై అనాసక్తి.. ఎందుకో తెలుసా?

అధునాతన సీఎన్‌సీ మ్యాచింగ్‌, మెకానిక్‌, అధునాతన సాధనాన్ని ఉపయోగించే ఆర్టిసన్‌, ఇండస్ట్రీయల్‌ రోబోటిక్స్‌ అండ్‌ డిజిటల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ టెక్నీషియన్‌, తయారీ ప్రక్రియ, నియంత్రణ ఆటోమేషన్‌ కోర్సుల్లో పదో తరగతి పాసైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

#Tags