JNTU-GV: 26, 27 తేదీల్లో జేఎన్‌టీయూ జీవీలో జాతీయస్థాయి సింపోజియం

విజయనగరం అర్బన్‌: జేఎన్‌టీయూ గురుజాడ విజయనగరం (జీవీ) ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈ నెల 26, 27వ తేదీల్లో జాతీయస్థాయి సాంకేతిక సింపోజియం సదస్సు నిర్వహిస్తామని ట్రిబుల్‌ విభాగాధిపతి డాక్టర్‌ ఎ.పద్మజ గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిఽథులుగా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ కె.వెంకటసుబ్బయ్య, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ జీఎం (డీఈఈఏ) జె.వాణిశ్రీ హాజరవుతారని తెలిపారు. తొలిరోజున వర్క్‌షాప్‌ ఆన్‌ జనరేటివ్‌ ఏఐ, స్పార్క్‌ టెక్‌–టెక్నికల్‌ క్విజ్‌, ఎలక్ట్రానిన్‌–ఎలక్ట్రికల్‌ ఎగ్జిబిషన్‌తోపాటు మరికొన్ని సాంకేతికేతర కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. 27న వర్క్‌షాప్‌ ఆన్‌ జనరేటివ్‌ ఏఐ, ప్రాజెక్ట్‌ ఎక్స్‌పో, పేపర్‌ ప్రెజెంటేషన్‌తోపాటు మరికొన్ని సాంకేతికేతర కార్యక్రమాలు ఉంటాయని వివరించారు.

చదవండి: 10th Class & Inter Exams: టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

#Tags