IAS Foundation Classes: రేపటి నుంచి ఐఏఎస్ ఫౌండేషన్ తరగతులు ప్రారంభం.. అర్హులు వీరే!
పాఠశాల స్థాయి విద్యార్థులకు ప్రకటించిన తేదీ సమయం ఆధారంగా ఐఏఎస్ ఫౌండేషన్ తరగతులు కొనసాగుతాయి. దరఖాస్తులు ఈ విధంగా చేసుకోండి..
గుంటూరు: పాఠశాల స్థాయి విద్యార్థులకు మంగళవారం నుంచి ఐఏఎస్ ఫౌండేషన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, స్టూడెంట్ యూనియన్ ఫర్ నేషన్ కన్వీనర్ కె.సాయికుమార్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బ్రాడీపేట యూటీఎఫ్ సమావేశ మందిరంలో సాయంత్రం ఆరు నుంచి 8 గంటల వరకు నిర్వహించే ఈ ఉచిత ఐఏఎస్ ఫౌండేషన్ శిక్షణ తరగతులకు పదో తరగతి ఆపైన చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు నిపుణులైన అధ్యాపకులు, ఉన్నత అధికారులతో శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల పేర్లు రిజిస్ట్రేషన్ కోసం 7207566 702, 6309481514, 86888 97406 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
#Tags