AP PGCET 2024 State Rankers : పీజీసెట్ ఫలితాల్లో స్టేట్ ర్యాంకులను సాధించిన డిగ్రీ విద్యార్థులు..
ఏటా నిర్వహించే పోస్ట్ గ్రాడ్యువేషన్ ప్రవేశ పరీక్షలో రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు టాపర్లుగా మెరిసారు..
రాయచోటి: ఏపీ పీజీ సెట్ – 2024 ఫలితాల్లో రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనపరించారు. అడ్వాన్స్డ్ ఉర్దూ విభాగంలో వరుసగా 1, 4, 8, 11, 15 స్టేట్ ర్యాంకులను సాధించారు. ఎకనామిక్స్ విభాగంలో 3, 10వ రాష్ట్రస్థాయి ర్యాంకులను సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్, విభాగాధిపతులు అభినందించారు. ఉర్దూలో ఎస్.జయనబ్ 1వ ర్యాంకు, పి.మాదిహా 4, ఎస్.ముజఫర్ హుస్సేన్ 4, ఎస్.రుక్సానా 8, ఎస్.టక్కల గౌస్ 11, ఎస్.సమీరా 11, ఎస్.తబస్సమ్ 15వ ర్యాంకులు సాధించారు. ఎకనామిక్స్ విభాగంలో 3, 10వ ర్యాంకులను ఎస్ఎండీ బాదుల్లా, ఎస్.ఆలియాలు సాధించి సత్తా చాటారు.
Science Labs in Schools : సైన్స్ ల్యాబ్ల ఉపయోగాలపై అధికారులు పరిశీలన చేయాలి..
#Tags