Skip to main content

Results: ఫలితాలు విడుదల

Results
Results

వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ ఇన్‌స్టంట్‌ పరీక్షా ఫలితాలను వైస్‌ చాన్సలర్‌ ఆచార్య చింతా సుధాకర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య వై.పి. వెంకటసుబ్బయ్య, పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎన్‌. ఈశ్వరరెడ్డితో కలిసి విడుదల చేశారు. సోమవారం విశ్వవిద్యాలయంలోని వీసీ చాంబర్‌లో పరీక్షా ఫలితాల సందర్భంగా గణాంకాలను వీసీ పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు పీజీసెట్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు వీలుగా పరీక్షా ఫలితాలను త్వరితగతిన విడుదల చేసినట్లు తెలిపారు. పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎన్‌. ఈశ్వరరెడ్డి మాట్లాడుతూ సీబీసీఎస్‌ ప్యాట్రన్‌లో జరిగిన బీఏ, బీకాం, బీఎస్సీ ఇన్‌స్టంట్‌ పరీక్షలకు 2,986 మంది విద్యార్థులు హాజరుకాగా 2,864 (97.15 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారని, 84 మంది పరీక్ష తప్పారని వివరించారు. కార్యక్రమంలో సహాయ పరీక్షల నియంత్రణ అధికారి డా. సుమిత్ర పాల్గొన్నారు.

Published date : 26 Sep 2023 07:18PM

Photo Stories