ధర్మవరం అర్బన్: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉచితంగా కంప్యూటర్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సురేష్బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి షేక్ అబ్దుల్ఖయ్యూమ్ తెలిపారు.
కంప్యూటర్ శిక్షణ
స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం వారు మాట్లాడుతూ డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సును సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించనున్నామని తెలిపారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ పూర్తి చేసి ఆసక్తి ఉన్న యువతీ, యువకులు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. పూర్తి వివరాలకు 9182288465 నంబర్, లేదా పాలిటెక్నిక్ కళాశాలలో సంప్రదించాలని కోరారు.