సొంత ఖర్చుతో..విద్యార్థులను ఆకాశాన తిప్పిన గొప్ప టీచర్..ఎందుకంటే..?
Sakshi Education
అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలంలోని మద్దన్నగారిపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రతిభ కనబరిచిన ఐదుగురు విద్యార్థులను ఆ పాఠశాల ఉపాధ్యాయుడు రమేశ్ తన సొంత ఖర్చుతో విమానంలో హైదరాబాద్కు తీసుకెళ్లారు.
![](/sites/default/files/images/2021/10/05/teacher-1633437236.jpeg)
ఆజాదీకి అమృత్ మహోత్సవంలో భాగంగా పాఠశాలకు చెందిన విద్యార్థులను జాతీయ నేతల వేషధారణలో బెంగళూరు నుంచి హైదరాబాద్కు విమానంలో తీసుకెళ్లారు. ఏటా చదువులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి విమానంలో విహరింపజేస్తుంటారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది ఐదుగురు విద్యార్థులను పిలుచుకెళ్లారు.
Published date : 05 Oct 2021 06:03PM