Nadu Nedu Scheme: రూ.310 కోట్లతో 447 జూనియర్ కళాశాలల అభివృద్ధి
![Junior Colleges Development in AP Nadu Nedu Scheme](/sites/default/files/images/2023/11/16/nadu-nedu-scheme-1700121754.jpg)
కొత్తపేట: రాష్ట్ర వ్యాప్తంగా 447 ప్రభుత్వ జూనియర్ కళాశాలలను రూ.310 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్టు సమగ్ర శిక్ష చీఫ్ ఇంజినీర్ కె.శ్రీనివాసరావు తెలిపారు. నాడు – నేడు పథకం కింద అభివృద్ధి చేస్తున్న జూనియర్ కళాశాలల పరిశీలనలో భాగంగా బుధవారం కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. పనులు నత్తనడకన జరుగుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి మీటింగులోనూ చెబుతున్నాం.. ఇది ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక కార్యక్రమం.. ఈ నెలాఖరుకు పనులన్నీ పూర్తికావాలి అని సూచించారు. పాడైన కిటికీ తలుపులన్నీ తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని అధికారులు, కమిటీకి సూచించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో నాడు–నేడు కింద రూ.7.29 కోట్లతో 10 జూనియర్ కళాశాలల అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. ఆయన వెంట సమగ్ర శిక్ష డీఈఈ జె.రాంజీ ఉన్నారు.
చదవండి: New opportunities: క్రీడారంగంలో సరికొత్త అవకాశాలు!