Skip to main content

Jewel of India Award : జ్యువెల్‌ ఆఫ్‌ ఇండియా అవార్డును సాధించిన పాలిటెక్నిక్ క‌ళాశాల లెక్చ‌ర‌ర్‌..

Jewel of India is awarded to Government Polytechnic College Lecturer Vemula Veeraswamy

కదిరి అర్బన్‌: ప్రతిష్టాత్మకమైన జ్యువెల్‌ ఆఫ్‌ ఇండియా అవార్డును స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల లెక్చరర్‌ వేముల వీరాస్వామి అందుకున్నారు. సాంకేతిక విద్యారంగ వ్యవస్థను అన్ని కోణాల్లో సంరక్షిస్తూ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అత్యుత్తమ విద్యనందిస్తూ, ఉత్తమ ఫలితాలు సాధిస్తూ, భావితరాలకు ఉత్తమ పౌరులను అందిస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డు ప్రకటించినట్లు న్యూఢిల్లీకి చెందిన కేటీకే అవుట్‌స్టాండింగ్‌ అచీవర్స్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ మేజర్‌ యశ్‌పాల్‌సింగ్‌ తెలిపారు. ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని తపాలా ద్వారా మంగళవారం వీరాస్వామి అందుకున్నారు.

Education Funds : బడికి వెళ్లే విద్యార్థులు, బడి ఈడు పిల్లలందరికీ త‌ల్లి వంద‌నం ఇవ్వాల్సిందే..!

Published date : 03 Jul 2024 03:56PM

Photo Stories