Skip to main content

Indian Students : అంత‌ర్జాతీయ స్థాయి వ‌ర్క‌షాప్‌లో పాల్గొన్న‌ భార‌త విద్యార్థినులు..

అమ్మానాన్నలు వెంట లేకుండానే.. టీచర్లు తోడు లేకుండానే ఈ అమ్మాయిలు ధైర్యంగా దేశం దాటి చైనా వెళ్లారు. భార‌త దేశం త‌ర‌ఫున వెళ్లిన ఈ యువ‌తులు తమ తెలివితేట‌ల‌తో అద‌ర‌గొట్టారు. త‌మ ఆలోచ‌న‌ల‌ను, త‌మ విద్యను అంత‌ర్జాతీయ వేదిక‌గా పంచుకునే అవ‌కాశాల‌న్ని వినియోగించుకున్నారు.
Indian students representation at International Level Youth Science Technology Workshop in China

శాస్త్ర సాంకేతిక సదస్సులో 38 దేశాల నుంచి హాజరైన బృందాలలో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించారు. తెలుగు వారి తెలివితేటలను నిరూపించుకున్నారు. అంతర్జాతీయ ప్లాట్‌ఫారంపై అదరగొట్టారు. భావి శాస్త్రవేత్తలుగా భళా అనిపించుకున్నారు. ఎంచక్కా తిరిగి వచ్చారు. తమ అనుభవాలను సాక్షితో సంతోషంగా పంచుకున్నారు.

Nalin Prabhat: జమ్మూకశ్మీర్‌ డీజీపీగా.. ఏపీ కేడర్‌ ఐపీఎస్‌ నలిన్‌ ప్రభాత్

ఇంతకూ ఎవరా అమ్మాయిలు..?
ఆంధ్రప్రదేశ్, కాకినాడకు చెందిన సాయిశ్రీ శ్రుతి చిట్టూరి, లక్ష్మీ ఆశ్రిత నామ, సంజన పల్లా, వైష్ణవి వాకచర్లలకు అంతర్జాతీయ వేదికపై భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చింది. చైనీస్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ సైన్స్‌ టెక్నాలజీ, చైనా ఎడ్యుకేషన్‌ క్యాంప్‌ రెగ్‌ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన యూత్‌ సైన్స్‌ టెక్నాలజీ వర్క్‌షాపులో ఈ స్టూడెంట్స్‌ పాల్గొన్నారు. సదస్సులో పాల్గొని ఇటీవలే తిరిగి వచ్చారు.

ఆలోచనలను పంచుకున్నాం..
దక్షిణాఫ్రికా, నేపాల్, ఆస్ట్రేలియా, మంగోలియా తదితర దేశాల విద్యార్థినుల పరిశోధన అంశాలపై ఆలోచనలు పంచుకోవడానికి మాకు మంచి అవకాశం వచ్చింది. ముఖ్యంగా ఒకే వయస్సు వాళ్లం ఒక చోట చేరి ఎంపిక చేసుకున్న అంశాలపై విశ్లేషించుకోవడానికి ఈ సదస్సు ఉపకరించింది.
- వైష్ణవి. ఎంపీసీ విద్యార్థిని, కాకినాడ

Campus Drive : పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థుల‌కు క్యాంప‌స్ డ్రైవ్‌.. ఎప్పుడు..?

పురాతన జీవశాస్త్రంపై పరిశోధన..
ఈ వర్క్‌షాపు ద్వారా వివిధ ప్రాంతాల విశిష్టత, ఆయా ప్రాంతాల్లో జీవరాశుల స్వభావం, స్థితిగతులపై ప్రాథమికంగా కొంత అవగాహన ఏర్పరుచుకుకో గలిగాం. భవిష్యత్తులో శాస్త్రవేత్తలం కావాలనే మా సంకల్పానికి ఈ వర్క్‌షాపు కచ్చితంగా ఉపయోగమే.
– సంజన, బైపీసీ విద్యార్థిని, కాకినాడ

ఎనిమిదో ఏడు..
చైనా ఏటా ప్రపంచ స్థాయిలో 2017 నుంచి సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వర్క్‌షాపు నిర్వహిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలు, వివిధ భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆలోచనలను పంచుకోవాలి. అలా భారతదేశం తరఫునప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారీ అమ్మాయిలు. భావి శాస్త్రవేత్తలకు దిక్సూచి: విశ్వం ఆవిర్భావం నుంచి నేటివరకూ ప్రపంచంలో చోటు చేసుకున్న మార్పులపై నిరంతరం పరిశోధనలు కొనసాగడం ఈ వర్క్‌షాపు లక్ష్యం. ఈ వర్క్‌షాపు లో ఎంపీసీ స్టూడెంట్స్‌ (శృతి, వైష్ణవి) ‘చేజింగ్‌ ద సన్‌’ అంశాన్ని, బైపీసీ స్టూడెంట్స్‌ (లక్ష్మి ఆశ్రిత, సంజన) ఫాజిల్స్‌ ను ఎంపిక చేసుకున్నారు. వివిధ దేశాల నుంచి ఎంపికైన వారితో తమ అభి్రపాయాలను పంచుకుని విజయ వంతంగా తిరిగి వచ్చారు.
– లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి, కాకినాడ.

FAKE Jobs: ఇంటర్వ్యూ లేకుండానే ప్రభుత్వ శాఖలో ఉద్యోగం.. నిరుద్యోగులే టార్గెట్‌

Published date : 16 Aug 2024 04:52PM

Photo Stories