Ganapatinagaram student participates in mission Gaganyaan
సాక్షి ఎడ్యుకేషన్: ఇస్రో ఇటీవల చేపట్టిన గగన్యాన్ తొలిమానవ రహిత మిషన్లో గజపతినగరానికి చెందిన కొర్రాయి జగదీష్ పాలుపంచుకున్నారు. రెండేళ్లుగా ఇస్రోలో శాస్త్రవేత్తగా ఆయన పనిచేస్తున్నారు. గగన్యాన్ మిషన్లో పాల్గొన్న జగదీష్ను స్థానికులు అభినందించారు.
మద్రాస్ ఐఐటీలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించిన జగదీష్ తండ్రి హరిబాబు వీఆర్వోకాగా, తల్లి అప్పికొండ సత్యవతి సాలూరు తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నారు.