Skip to main content

CBSE Schools : స‌హోద‌య గ్రూప్‌గా సీబీఎస్ఈ పాఠ‌శాల‌లు!

CBSE schools now as sahodaya group

గుంటూరు: అమరావతి పరిధిలోని సీబీఎస్‌ఈ పాఠశాలలు సహోదయ గ్రూప్‌గా ఏర్పడటం మంచి పరిణామమని సీబీఎస్‌ఈ పాఠశాలల విజయవాడ ప్రాంతీయ అధికారి సువేందు శేఖర్‌దాసు పేర్కొన్నారు. ఆయన శనివారం లక్ష్మీపురంలోని శ్రీపాటిబండ్ల సీతారామయ్య పాఠశాలలో సీబీఎస్‌ఈ పాఠశాలల ప్రిన్సిపల్స్‌తో సమావేశం నిర్వహించారు.
Awareness Program : అక్టోబ‌ర్ 2న మిలిట‌రీ, సైనిక్ స్కూళ్ల ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌పై అవ‌గాహ‌న స‌ద‌స్సు..
గుంటూరు, కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్‌, బాపట్ల జిల్లాల నుంచి హాజరైన 30 మంది ప్రిన్సిపల్స్‌ను ఉద్దేశించి మాట్లాడారు. కాంప్లెక్స్‌ అధ్యక్షురాలు సుధామాధవి, కార్యదర్శి లేళ్ల కృష్ణవేణి, సభ్యులు సరళ, సీతారామయ్య పాల్గొన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 29 Sep 2024 02:50PM

Photo Stories