Awareness Program : అక్టోబర్ 2న మిలిటరీ, సైనిక్ స్కూళ్ల ప్రవేశ పరీక్షలపై అవగాహన సదస్సు..
తిరుపతి: 2025–26 విద్యా సంవత్సరంలో మిలటరీ, సైనిక్ స్కూళ్ల ప్రవేశ పరీక్షలకు సంబంధించి తిరుపతి వరదరాజనగర్లోని విశ్వం టాలెంట్ స్కూలులో అక్టోబరు 2వ తేదీ అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఆ మేరకు శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో విశ్వం విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎన్.విశ్వనాథ్రెడ్డి పేర్కొన్నారు.
World Teacher's Day : వరల్డ్ టీచర్స్ డే సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు
రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్, సైనిక్ స్కూల్ 6, 9వ తరగతిలో ప్రవేశాలకు జాతీయస్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షకు సంబంధించి ఏర్పాటు చేస్తున్న అవగాహన సదస్సుకు 5 నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరుకావచ్చన్నారు. ఆయా పరీక్షలకు సంబంధించి వివరాలు తెలుసుకోవడంతోపాటు సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)