B.Ed Exam: 23 నుంచి బీఎడ్ రెండో సెమిస్టర్ పరీక్షలు
Sakshi Education
ఎచ్చెర్ల క్యాంపస్: బీఎడ్ రెండో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 23 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లు ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్.ఉదయ్భాస్కర్ మంగళవారం తెలిపారు. 901 మంది పరీక్షకు హాజరవుతుండగా, జీసీఎస్ఆర్ రాజాం, శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల, శ్రీకాకుళం ప్రభుత్వ మహిళల కళా శాల, టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పలాస ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోస్టు గ్రాడ్యుయేషన్ మూడో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 30వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు తెలిపారు. బీటెక్ ఏడో సెమిస్టర్ ఈ నెల 28వ తేదీ నుంచి ఉంటుందన్నారు.
Published date : 24 Nov 2023 10:23AM