సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి Telangana State Public Service Commission (TSPSC) డిసెంబర్ 7న నోటిఫికేషన్ జారీ చేసింది.
పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్
19 రకాల సబ్జెక్టులకు సంబంధించి మొత్తం 247 లెక్చరర్ ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రొఫార్మా వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్ వెల్లడించింది.
ఆసక్తి గల అభ్యర్థుల నుంచి డిసెంబర్ 14 నుంచి జనవరి 4వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మరిన్ని వివరాలకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ను సందర్శించాలని కమిషన్ కార్యదర్శి డిసెంబర్ 7న ఒక ప్రకటనలో తెలిపారు.