Skip to main content

స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మార్చి 11న వెరిఫికేషన్

సాక్షి, హైదరాబాద్: స్కూల్ అసిస్టెంట్ (సోషల్) ఉర్దూ మీడియం పోస్టుల భర్తీకి సంబంధించి ఖాళీగా ఉన్న పోస్టులకు ఏడుగురు దివ్యాంగ అభ్యర్థులకు ఈ నెల 11న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉండనుంది.
ఈ మేరకు 11న ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ మార్చి 6 (శుక్రవారం)నఓ ప్రకటనలో తెలిపింది. పూర్తి వివరాలకు www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది.
Published date : 07 Mar 2020 03:41PM

Photo Stories