Skip to main content

మార్చి 8న కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టు

సాక్షి, హైదరాబాద్: పలు శాఖల్లోని జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, జూనియర్ స్టెనో, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు పోస్టుల భర్తీకి సంబంధించి అర్హత కలిగిన అభ్యర్థులకు ఈ నెల 8న కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది.
రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగానే తుది ఎంపిక ఉంటుందని, ప్రొఫిషియన్సీ టెస్టు అర్హత పరీక్ష మాత్రమేనని పేర్కొంది. హాల్ టికెట్లు, ఇతర వివరాలకు www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది.
Published date : 07 Mar 2020 03:41PM

Photo Stories