సాక్షి, హైదరాబాద్: యూనిఫాం సర్విసెస్ ఉద్యోగాల భర్తీలో భాగంగా పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ కానిస్టేబుల్ (డ్రైవర్), అగ్నిమాపకశాఖలోని డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు డ్రైవింగ్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు చేసినట్లు టీఎస్ఎల్పీఆర్బీ ఛైర్మన్ వి.వి శ్రీనివాసరావు మార్చి 17న ఓ ప్రకటనలో తెలిపారు.
రెండు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు ఉండటం వల్ల..మార్చి 17, 18 తేదీల్లో నిర్వహించాల్సిన డ్రైవింగ్ పరీక్షలను మార్చి 23, 24 తేదీలకు మార్చినట్లు తెలిపారు. ఇప్పటికే అడ్మిట్కార్డులు డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు అవే అడ్మిట్కార్డులతో పరీక్షకు హాజరుకావచ్చని వెల్లడించారు.