Skip to main content

Junior Lineman: జేఎల్‌ఎం భర్తీ ప్రక్రియ మళ్లీ షురూ

ఆదిలాబాద్‌టౌన్‌: కోర్టు తీర్పు కారణంగా కొన్నేళ్ల క్రితం వాయిదపడిన జూనియర్‌ లైన్‌మెన్‌ (జేఎల్‌ఎం) ఉద్యోగుల భర్తీ ప్రక్రియను మళ్లీ చేపట్టారు.
JLM replacement process will start again  Adilabad Town   Court Verdict Prompts Restart of Junior Linemen  Replacement

ఫిబ్ర‌వ‌రి 1న‌ జిల్లా కేంద్రంలోని ఎస్‌ఈ కార్యాలయ ఆవరణలో పోల్‌ క్లైమింగ్‌ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 43 మంది అభ్యర్థులకు గాను ఐదుగురు గైర్హాజరయ్యారు. గతంలో రిజర్వేషన్‌ విషయమై పలువురు జేఎల్‌ఎం అభ్యర్థులు కోర్టును ఆశ్రయించిన విషయం విధితమే. అయితే కోర్టులో కేసు ఉన్న కారణంగా భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది.

చదవండి: Junior Lineman: జేఎల్‌ఎంలకు స్తంభం పరీక్ష.. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటిస్తూ ఈ జాబితా

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 43 మందికి భర్తీ విషయంలో తాజాగా కోర్టు ఆదేశాలతో ప్రక్రియను చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ జేఆర్‌ చౌహన్‌ మాట్లాడుతూ అభ్యర్థులకు పోల్‌ క్‌ల్లైమింగ్‌ పరీక్ష నిర్వహించారు. అయితే ఇందులో ఓ అభ్యర్థి స్తంభాన్ని బాగానే ఎక్కినప్పటికి బ్యాలెన్స్‌ కొల్పోవడంతో పట్టుతప్పి కింద పడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఏర్పాటు చేసిన తాడు సాయంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు.

Published date : 03 Feb 2024 09:20AM

Photo Stories