సాక్షి, హైదరాబాద్: ఇంటర్మిడియేట్ పరీక్ష పేపర్ల ఆన్లైన్ మూల్యాంకన కాంట్రాక్టుకు టెండర్లు మళ్లీ పిలుస్తున్నట్టు తెలంగాణ ఇంటర్మిడియేట్ బోర్డ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జయప్రదా భాయ్ తెలిపారు.
ఇంటర్ మూల్యాంకనానికి మళ్లీ టెండర్లు
ఈ మేరకు ఫిబ్రవరి 13న ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల పిలిచిన టెండర్లలో మేగ్నటిక్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఒక్కటే పాల్గొందని, దీంతో మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. బోర్డ్ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయిన ఓ జూనియర్ లెక్చరర్ మరో కంపెనీకి కట్టబెడుతున్నట్టు చేసిన ప్రచా రం అవాస్తమని స్పష్టం చేశారు.