RGUKT: ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్ ప్రారంభం.. కౌన్సెలింగ్కు ఇవి తప్పనిసరి..
Sakshi Education
నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో 2023–24 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ జూలై 20న ప్రారంభమైంది.
ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్ ప్రారంభం.. కౌన్సెలింగ్కు ఇవి తప్పనిసరి..
నూజివీడు ట్రిపుల్ఐటీకి 1,040 మంది విద్యార్థులను ఎంపిక చేయగా... తొలిరోజు కౌన్సెలింగ్కు రావాలని 550 మందికి కాల్లెటర్లు పంపించారు. వారిలో 481 మంది హాజరవగా.. అందరికీ సీట్లు కేటాయించారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీట్లు పొందిన తొలి 30 మందికి అడ్మిషన్ పత్రాలను ఆర్జీయూకేటీ చాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి అందజేశారు. సర్టిఫికెట్ల పరిశీలన కోసం 20 కౌంటర్లను ఏర్పాటు చేసి 70 మంది సిబ్బందిని నియమించారు. కౌన్సెలింగ్కు వచ్చిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూశారు. అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య ఎస్ఎస్ఎస్వీ గోపాలరాజు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ మేరుగ అర్జునరావు పర్యవేక్షించారు.