Skip to main content

NEET 2021: నీట్‌ స్టేట్‌ ర్యాంకులు విడుదల

వైద్య విద్యలో చేరేందుకు విద్యార్థులు ఎదురు చూస్తున్న నీట్‌ స్టేట్‌ ర్యాంకులు నవంబర్‌ 23న వెలువవడ్డాయి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వ విద్యాలయం రిజీస్టార్‌ డాక్టర్‌ కె.శంకర్‌ తెలిపారు.
NEET 2021
NEET 2021: నీట్‌ స్టేట్‌ ర్యాంకులు విడుదల

నీట్‌ బోర్డు నుంచి రాష్ట్ర ర్యాంకుల వివరాలు నవంబర్‌ 22 రాత్రికి యూనివర్సిటీకి వచ్చాయి. వాటిని క్రోడీకరించి నవంబర్‌ 23న మధ్యాహ్నం 12 గంటలకు స్టేట్‌ ర్యాంకులను వర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఆ ర్యాంకుల ఆధారంగా అడ్మిషన్లు చేపట్టనున్నారు. నీట్‌ ఫలితాలు వెల్లడించి 20 రోజులు కావస్తుండగా, కొన్ని సాంకేతిక పరమైన అంశాలతో స్టేట్‌ ర్యాంకులు ప్రకటించడంలో జాప్యం జరిగింది. ప్రస్తుతం స్టేట్‌ ర్యాంకులు ప్రకటిస్తుండటంతో ఇక అడ్మిషన్ల ప్రక్రియకు త్వరలోనే శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. 

నీట్‌ కటాఫ్‌ స్కోర్‌ వివరాలు:

జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీకి 50 పర్సంటైల్, కట్‌ ఆఫ్‌ స్కోర్‌: 138

ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు 40 పర్సంటైల్, కట్‌ ఆఫ్‌ స్కోర్‌: 108 

పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 45 పర్సంటైల్, కట్‌ ఆఫ్‌ స్కోర్‌: 122

>> నీట్‌ 2021 స్టేట్‌ ర్యాంకుల కోసం క్లిక్ చేయండి

చదవండి: 

EWS: ఈడబ్ల్యూఎస్‌ కోటా.. ఎంబీబీఎస్‌కు కేటాయించిన సీట్లు సంఖ్య!

NEET: డాక్టరమ్మ...

NEET: నీట్‌లో గురుకుల విద్యార్థుల ప్రభంజనం

Published date : 23 Nov 2021 05:25PM

Photo Stories