Skip to main content

NEET: నీట్‌ రాష్ట్ర ర్యాంకులు మరింత ఆలస్యం

దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) యూజీ–2021 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ర్యాంకుల కేటాయింపు మరింత ఆలస్యం అవ్వనున్నట్లు ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ వీసీ డాక్టర్‌ పి.శ్యామ్‌ప్రసాద్‌ నవంబర్‌ 16న ‘సాక్షి’కి తెలిపారు.
NEET
నీట్‌ రాష్ట్ర ర్యాంకులు మరింత ఆలస్యం

నీట్‌లో ఉత్తీర్ణులైన వారి సమాచారం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్ టీఏ) నుంచి నవంబర్‌ 16న ఉదయం అందినట్లు చెప్పారు. అయితే సాంకేతిక లోపాల వల్ల అర్హుల సమాచారం నిక్షిప్తం చేసి పంపిన డివైజ్‌ ఓపెన్ కాలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నవంబర్‌ 17న ఎన్ టీఏకు మెయిల్‌ పంపుతామని ఈ మొత్తం ప్రక్రియ జరిగి రాష్ట్ర ర్యాంకులు కేటాయించడానికి మరో నాలుగైదు రోజుల సమ యం పట్టొచ్చని వివరించారు. సాంకేతిక అవరోధాలు ఏర్పడకపోయి ఉంటే నవంబర్‌ 16న రాత్రి లేదా నవంబర్‌ 17న నోటిఫికేషన్ విడుదలయ్యేదన్నారు. దేశ వ్యాప్తంగా ఈ ఏడాది సెప్టెంబర్‌ 12న నీట్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏపీ నుంచి 59 వేల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకుని పరీక్ష రాశారు. నవంబర్‌ 2వ తేదీన ఎన్ టీఏ విద్యార్థుల ఈ–మెయిల్, ఫోన్ నంబర్‌లకు ర్యాంక్‌ కార్డులను పంపింది. జాతీయ స్థాయిలో వచ్చిన ర్యాంక్‌ ఆధారంగా రాష్ట్ర స్థాయిలో ఏ ర్యాంక్‌ వస్తుంది? సీటు వస్తుందా? లేదా? అని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

చదవండి: 

Ritika : పెళ్లి కోసం దాచిన నగలు అమ్మి చదివింది..కట్ చేస్తే ఆల్ ఇండియా ర్యాంకు..

EWS: ఈడబ్ల్యూఎస్‌ కోటా.. ఎంబీబీఎస్‌కు కేటాయించిన సీట్లు సంఖ్య!

NEET: డాక్టరమ్మ...

NEET Results: నీట్‌ ఫలితాల్లో గిరిజన విద్యార్థుల హవా: గిరిజన, స్త్రీ–శిశు సంక్షేమ శాఖల మంత్రి

Published date : 18 Nov 2021 01:17PM

Photo Stories