Skip to main content

సింగరేణి ఉద్యోగులకు నూతన గృహాలు.. ఏడాదిలోగా 1,478 ఇళ్ల నిర్మాణం: సీఎండీ శ్రీధర్

సాక్షి, హైదరాబాద్: సింగరేణి ఉద్యోగుల కోసం తొలి దశలో రూ.333 కోట్ల వ్యయంతో 1,478 ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
963 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు పడకల గదిని నిర్మిస్తున్నామని తెలిపారు. భూపాలపల్లిలో రూ.216 కోట్లతో 994 క్వార్టర్లు, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రూ.80 కోట్లతో 352 క్వార్టర్లు, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో రూ.37 కోట్లతో 132 క్వార్టర్లు నిర్మాణంలో ఉన్నాయని ఆయన వివరించారు.
Published date : 19 Jan 2021 04:17PM

Photo Stories