Skip to main content

అటెన్షన్ ప్లీజ్: నేషనల్ టాలెంట్ సెర్చ్ పరీక్ష కేంద్రాల్లో పలు మార్పులు..

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి నేషనల్ టాలెంట్ సెర్చ్ పరీక్ష (ఎన్టీఎస్‌ఈ) స్టేజ్-1లో ఎంపికై న విద్యార్థులకు విశాఖపట్నంలో ఈ నెల 14న నిర్వహించాల్సిన స్టేజ్-2 పరీక్ష కేంద్రాల్లో మార్పులు చేశారు.
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్టీ) ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు ఎ.సుబ్బారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంబంధిత విద్యార్థులందరూ వారి సవరించిన అడ్మిట్ కార్డులను ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్‌టీఎస్‌ఈ.ఎన్‌ఐసీ.ఐఎన్’ వెబ్‌సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
Published date : 06 Feb 2021 03:36PM

Photo Stories