Students Competitions: జయపురం మునిసిపాలిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు పోటీలు
Sakshi Education
విద్యార్థులకు వివిధ రకాల్లో పోటీల నిర్వాహణ. ఇందులో ప్రతీ విద్యార్థి పాల్గొనవచ్చు అని తెలిపారు. ఈ పోటీల వలన విద్యార్థులు మరింత మెరుగ పడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పిల్లలకు చదువులో మార్రమే కాకుండా వివిధ రంగాల పోటీలలోల పాల్గొనాలని వివరించారు.
participants for the competition
సాక్షి ఎడ్యుకేషన్ : ఈ నెల 31న జరగనున్న స్వయం శాసన దినోత్సవాల సందర్భంగా జయపురం మునిసిపాలిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు చిత్ర లేఖనం, వక్తృత్వం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. 350 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు మున్సిపల్ కార్యనిర్వాహక అధికారి సిద్దార్ధ పట్నాయక్ తెలిపారు.
చిత్రలేఖన సబ్జూనియర్ విభాగంలో గౌతమ పూజారి, సోనీ సింగ్, సోనమ్ కుమారి తొలిమూడు స్థానాల్లో నిలిచారు. సీనియర్ చిత్ర లేఖనం పోటీల్లో త్రిపాఠీ, అపరాజిత మహాపాత్రో, ఘెను పడాల్ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. విజేతలకు ఈ నెల 31న బహుమతుల ప్రదానం చేస్తామని తెలిపారు.