Job Mela: 4న జాబ్మేళా.. నెలకు రూ.25 వేల వరకూ జీతం
![job mela Opportunity for various educational backgrounds Kakinada City job fair announcement](/sites/default/files/images/2024/03/05/regional-job-mela-1709636924.jpg)
కాకినాడ సిటీ: కలెక్టరేట్లోని వికాస కార్యాలయంలో ఈ నెల 4న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు పీడీ కె.లచ్చారావు శుక్రవారం తెలిపారు. టాటా ఎలక్ట్రానిక్స్(ఆపిల్ మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్)లో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, మైరెన్ ఫుడ్ కంపెనీలో సీనియర్ అకౌంటెంట్, ఒప్పో మొబైల్స్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్, భారత్ ఫోర్ట్ కంపెనీలో టెక్నీషియన్, బృందావన్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, పీఆర్ఓ, నిట్ ఐసీఐసీఐ బ్యాంక్లో రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఈ మేళా జరుగుతుందని వివరించారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైన 35 ఏళ్ల లోపు వారు ఈ పోస్టులకు అర్హులన్నారు. వీరికి నెలకు రూ.12 వేల నుంచి రూ.25 వేల వరకూ జీతం, ఉద్యోగాన్ని బట్టి భోజనం, వసతి, రవాణా సౌకర్యాలుంటాయన్నారు. ఆసక్తి ఉన్న వారు సోమవారం ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్ల జెరాక్స్లతో హాజరు కావాలని లచ్చారావు సూచించారు.