సాక్షి, హైదరాబాద్: Indian Institute of Technology (IIT)ల్లో ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశానికి JEE Advanced పరీక్షను 2023 జూన్ 4న నిర్వహిస్తున్నట్టు National Testing Agency (NTA) ప్రకటించింది.
జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ షెడ్యూల్
ఉదయం 9 నుంచి 12 గంటల వరకూ పేపర్–1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ పేపర్–2 ఉంటుందని పేర్కొంది. జేఈఈ మెయిన్స్లో ఉత్తీర్ణులైన వారిని ర్యాంకుల ప్రకారం 2.50 లక్షల మందిని అడ్వాన్స్డ్కు అనుమతిస్తారు. ఇందులో వచ్చే ర్యాంకుల ఆధారంగా ఐఐటీల్లో సీట్లు కేటాయిస్తారు.