రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఏపీ ఐసెట్–2021కి తొలిరోజు సెప్టెంబర్ 17న 90.03 శాతం మంది హాజరైనట్లు ఏపీ సెట్స్ ప్రత్యేకాధికారి డాక్టర్ ఎమ్.సుధీర్రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఐసెట్కు 90.03 శాతం హాజరు
సెట్ కోడ్ను ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ ఆచార్య జి.శశిభూషణరావు, ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పేరి శ్రీనివాసరావు, ఆచార్య సీహెచ్వీవీఎస్ భాస్కరరెడ్డి, ఆచార్య బి.పార్వతీశ్వరరావు పాల్గొన్నారు.