Skip to main content

APPSC Group-1 Ranker Success Story : రైతు బిడ్డ.. డిప్యూటీ కలెక్టర్ అయ్యాడిలా.. వీరి ప్రోత్సాహంతోనే..

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల ఆశ‌లు ఎట్ట‌కేల‌కు ఫ‌లించాయి. ఎన్నో న్యాయ వివాదాలు, పలుమార్లు వాయిదాలు, రెండుసార్లు మెయిన్‌ మూల్యాంకనం ఇలా పలు సవాళ్లను అధిగమించి.. ఎట్ట‌కేల‌కు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) గ్రూప్‌–1 (2018) ఫైన‌ల్ ఎంపిక జాబితాను విడుద‌ల చేసింది.
గాండ్లూరి కేశవర్దన్‌రెడ్డి, ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ర్యాంక‌ర్‌
గాండ్లూరి కేశవర్దన్‌రెడ్డి, ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ర్యాంక‌ర్‌

2018 డిసెంబర్‌లో మొత్తం 167 పోస్టుల నోటిఫికేషన్ ఇచ్చిన విష‌యం తెల్సిందే. ఈ నేప‌థ్యంలో గ్రూప్‌–1లో ఫ‌లితాల్లో మంచి ర్యాంక్ సాధించి డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగానికి ఎంపికైన గాండ్లూరి కేశవర్దన్‌రెడ్డి స‌క్సెస్ స్టోరీ మీకోసం..

చ‌ద‌వండి: Indian Polity Notes for Competitive Exams: ద్విసభా పద్ధతి అమల్లో ఉన్న రాష్ట్రాలేవి?

ఈ ఘనత సాధించానంటే..
బుక్కపట్నం మండలం నల్లగుట్టపల్లికి చెందిన సాధారణ రైతు నాగార్జునరెడ్డి, సుబ్బలక్ష్మి దంపతుల కుమారుడు గాండ్లూరి కేశవర్దన్‌రెడ్డి గ్రూప్‌–1లో సత్తా చాటి డిప్యూటీ కలెక్టర్‌గా  ఎంపికయ్యారు. తమ బిడ్డ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం ఆనందంగా ఉందని తల్లిదండ్రులు తెలిపారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ ఘనత సాధించానని కేశవర్దన్‌రెడ్డి పేర్కొన్నారు.

చ‌ద‌వండి: Indian Polity Bit Bank for Competitive Exams: ఈ కింది ఏ దశాబ్దంలో ఎక్కువ రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి?

1,14,473 మంది అభ్యర్థులు పోటీప‌డ‌గా.. ఇందులో..
2018 డిసెంబర్‌లో మొత్తం 167 పోస్టుల (2 స్పోర్ట్స్‌ కోటాతో కలిపి) నోటిఫికేషన్‌ ఇచ్చారు. 2019 మేలో గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌కు 1,14,473 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 58,059 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. తరువాత కరోనా, ఇతర కారణాల వల్ల మెయిన్స్‌ పరీక్షలు మూడుసార్లు వాయిదా పడ్డాయి. 2020 డిసెంబర్‌లో మెయిన్స్‌ పరీక్షలను ట్యాబ్‌ ఆధారిత ప్రశ్నపత్రాలతో అత్యంత పకడ్బందీగా నిర్వహించారు. తొలిసారిగా గ్రూప్‌–1 సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని డిజిటల్‌ విధానంలో చేశారు. 2021 ఏప్రిల్‌లో వీటి ఫలితాలు విడుదల చేయగా కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇచ్చిన తీర్పుతో మూల్యాంకనాన్ని సంప్రదాయ పద్ధతిలో మ్యాన్యువల్‌గా అత్యంత పారదర్శకంగా చేయించారు. మొత్తం మూల్యాంకన ప్రక్రియను సీసీ కెమెరాల్లో చిత్రీకరించి భద్రపరిచారు. అనంతరం మూడు బోర్డులను ఏర్పాటు చేసి ఇంటర్వ్యూలను పూర్తి చేశారు. బోర్డుల్లో కూడా కమిషన్‌ సభ్యులు ఇద్దరితోపాటు ఇద్దరు ఆలిండియా సర్వీసు సీనియర్‌ అధికారులు, సబ్జెక్టు నిపుణులు ఉన్నారు.

చ‌ద‌వండి: Indian Polity for Competitive Exams: కేంద్ర ప్రభుత్వం – నిర్మాణం, అధికారాలు

Published date : 30 Jul 2022 01:24PM

Photo Stories