Skip to main content

2004 Tsunami: ఘోర విపత్తుకు 18 ఏళ్లు.. రాకాసి అల ఎగిసిపడి లక్షలాది మంది మృతి

అది 2004, డిసెంబర్ 26. ప్రకృతి ప్రకోపానికి ప్రపంచం చిగురుటాకులా వణికిపోయిన, సునామీ రూపంలో పెను విపత్తు పలు దేశాలను కబళించిన రోజు.
December 26, 2004 Tsunami

ఆ విషాదం జరిగి నేటికి 18 ఏళ్లు పూర్తయ్యాయి. మానవ చరిత్రలోనే అతిపెద్ద ప్రకృతి విలయాల్లో ఒకటిగా నిలిచిన సునామీ 14 దేశాల్లో 2,30,000 మందికి పైగా ప్రాణాలను బలి తీసుకుంది. హిరోషిమాపై అమెరికా ప్రయోగించిన అణు బాంబు కంటే 23,000 రెట్లు అధికమైన శక్తి ఈ సునామీ వల్ల విడుదలైందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే అప్పట్లో తేల్చింది. 

సునామీ ధాటికి ధ్వంసమైన చెన్నై మెరీనా బీచ్


ఇండోనేసియాకు ఆగ్నేయంగా ఉన్న సుమత్రా దీవుల్లో సంభవించిన భూకంపం ధాటికి ఆచె తీర ప్రాంతంలో రాకాసి అలలు 100 అడుగుల ఎత్తుకు ఎగిసిపడ్డాయి. కేవలం ఆచెలో లక్షా 60 వేల మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. స్థానిక కాలమానం ప్రకారం డిసెంబర్‌ 26న సుమిత్రా ద్వీపం వద్ద సముద్ర గర్భంలో రిక్టర్ స్కేల్‌పై 9.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. సముద్ర గర్భంలో ఇండియా ప్లేట్, బర్మా ప్లేట్‌ల మధ్య ఘర్షణ ఏర్పడటంతో 1000 కిలోమీటర్ల పొడవు, పది మీటర్ల లోతు మేర చీలిక ఏర్పడింది. దీంతో సముద్రంలో ఒక్కసారిగా నీరు ఉప్పొంగాయి. గంటల వ్యవధిలోనే తీరం వైపు శక్తిమంతమైన రాకాసి అలలు దూసుకొచ్చాయి.

☛ 1950లో గోల్డెన్‌ చాన్స్‌ను వదులుకున్న‌ భారత్‌.. ఇంత‌కు ఆ ఏడాది ఏమైందంటే..?

ఆంధ్రప్రదేశ్‌లోని తీరప్రాంతాలపై ప్రభావం

నీటిలో మునిగిన ఇండోనేసియాలోని పలు ప్రాంతాలు

 

హిందూ మహా సముద్రాని తీర ప్రాంతాలుగా ఉన్న 14 దేశాలను ఈ అలలు కకావికలం చేశాయి. సునామీ అలలు 5 వేల కిలోమీటర్లు ప్రయాణించి ఆఫ్రికా తీరానికి సైతం తీవ్ర నష్టాన్ని కలగించాయి. చాలాచోట్ల సుమారు 30 మీటర్ల ఎత్తులో అలలు తీరంపై విరుచుకుపడ్డాయి. ఈ విపత్తు కారణంగా భారత్‌‌లో సుమారు 10 వేల మందికి పైగా మరణించారు. ఈ సునామీ ధాటికి అండమాన్ నికోబార్ దీవుల్లో 4000 మంది, తమిళనాడులో 4500 మంది మృతి చెందారు. కడలూరు, నాగపట్టణంలోని తీర ప్రాంతంలోని చర్చిలకు క్రిస్మస్ ప్రార్థనల కోసం వచ్చిన వందలాది మంది రాకాసి అలకు బలయ్యారు. నాటి నుంచి సునామీ కారణంగా మరణించినవారి కుటుంబసభ్యులు ఏటా డిసెంబరు 26న సముద్రుడికి పూజలు చేస్తారు. పువ్వులతో, పాలతో అభిషేకం చేసి, ఎప్పుడూ శాంతంగా ఉండి మానవాళికి రక్షణగా ఉండాలంటూ సముద్రుడిని వేడుకుంటారు. ఈ సునామీ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని తీరప్రాంతాలు ప్రభావితమయ్యాయి.

Top-5 Football Legends : అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన‌.. టాప్‌–5 స్టార్స్ వీరే..!

Published date : 26 Dec 2022 03:40PM

Photo Stories