Skip to main content

MLC Elections: 18 స్థానాల్లో 11 బీసీల‌కే... టీడీపీలో ఓసీల‌కే పెద్ద‌పీట వేశారు: స‌జ్జ‌ల‌

ఏపీలో ఎమ్మెల్యే, స్థానిక కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు, గవర్నర్‌ కోటాలో అభ్యర్థుల పేర్లను వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. 18 ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేయ‌నున్న‌ అభ్యర్థుల పేర్లను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సోమవారం ప్రకటించారు.
Sajjala Ramakrishna Reddy

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సామాజిక న్యాయానికి వైఎస్సార్‌సీపీ కట్టుబడి ఉందని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేశామ‌ని, బీసీలంటూ బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు.. బ్యాక్‌బోన్‌ క్లాస్ అని న‌మ్ముతున్నామ‌న్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చిన‌ట్లు గుర్తుచేశారు. ఓట్ల కోసం నినాదాలు ఇచ్చే పార్టీ మాది కాదన్నారు. సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని అన్నారు. 

టీడీపీ హయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మండలిలో 37 శాతం ప్రాతినిధ్యం కల్పిస్తే.. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం మాత్రం బీసీలకే 43 శాతం ఎమ్మెల్సీ పదవులు ఇచ్చింద‌ని స‌జ్జ‌ల తెలిపారు. మండలిలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 68 శాతం ఎమ్మెల్సీ పదవులు ఇచ్చామన్నారు. సామజిక సాధికారిత అంటే త‌మ‌దేన‌ని, చంద్రబాబు మాటలు చెబితే.. తాము చేతల్లో చూపించామన్నారు. చంద్రబాబు హయాంలో ఇచ్చిన ప‌ద‌వుల్లో 62.5 శాతం ఓసీలు, 32 శాతం మాత్ర‌మే బీసీలు ఉన్నారన్నారు. తాము 87 మున్సిపాలిటీల్లో 84 చోట్ల గెలిస్తే.. అందులో 44 మంది బీసీల‌కు మున్సిపల్ చైర్మ‌న్ ప‌ద‌వులు ఇచ్చామ‌ని చెప్పారు. 

ఎమ్మెల్యే కోటాలో ఏడుగురు, స్థానిక కోటాలో 9 మంది, గవర్నర్‌ కోటాలో మరో ఇద్దరి పేర్లను స‌జ్జ‌ల‌ ప్రకటించారు. కాగా, 18 స్థానాల్లో బీసీలకు 11, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1, ఓసీలకు 4 స్థానాలను కేటాయించారు.
స్థానిక సంస్థల నుంచి..
- నత్తు రామారావు.. శ్రీకాకుళం (బీసీ, యాదవ)
- కుడుపూడి సూర్యనారాయణ.. తూర్పు గోదావరి (బీసీ-శెట్టి బలిజ)
- వంకా రవీంద్రనాథ్‌.. పశ్చిమ గోదావరి (పారిశ్రామికవేత్త)
- కవురు శ్రీనివాస్‌.. ప.గోదావరి ( బీసీ-శెట్టి బలిజ)
- మేరుగ మురళి.. నెల్లూరు (ఎస్సీ-మాల)
- డా. సిపాయి సుబ్రహ్మణ్యం.. చిత్తూరు 
- రామసుబ్బారెడ్డి.. కడప (ఓసీ-రెడ్డి)
- డాక్టర్‌ మధుసూదన్‌.. కర్నూలు (బీసీ-బోయ)
- ఎస్‌. మంగమ్మ.. అనంతపురం ( బీసీ-బోయ)
ఎమ్మెల్యే కోటా అభ్య‌ర్థులు... 
- పెనుమత్స సూర్యనారాయణ.. విజయనగరం ( క్షత్రియ సామాజిక వర్గం) 
- పోతుల సునీత.. ప్రకాశం (బీసీ- పద్మశాలి) 
- కోలా గురువులు.. విశాఖ (ఫిషరీస్‌ కార్పొరేషన్ చైర్మన్‌)
- బొమ్మి ఇ‍జ్రాయిల్‌.. తూ. గోదావరి ( ఎస్సీ-మాదిగ)
- జయమంగళ వెంకటరమణ, ప. గోదావరి (వడ్డీల సామాజిక వర్గం)
-  ఏసు రత్నం.. గుంటూరు ( బీసీ-వడ్డెర)
- మర్రి రాజశేఖర్‌.. గుంటూరు ( కమ్మ)
గవర్నర్‌ కోటాలో.... 
- కుంభా రవి.. అల్లూరి జిల్లా (ఎస్టీ)
- కర్రి పద్మశ్రీ.. కాకినాడ (బీసీ)

Published date : 20 Feb 2023 03:14PM

Photo Stories