Skip to main content

జేఎన్‌టీయూ 2020-21 అకడమిక్ క్యాలెండర్ వచ్చేసింది.. డిసెంబర్ 1 నుంచి తరగతులు

సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర వృత్తి సాంకేతిక విద్యా కోర్సుల్లో ఆన్‌లైన్ బోధనను ప్రారంభించాలని జేఎన్‌టీయూ నిర్ణయించింది.
ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రత్యక్ష బోధనపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థులకు ఆన్‌లైన్‌లో బోధన ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు సోమవారం పూర్తిస్థాయి షెడ్యూల్‌ను జారీ చేసింది. ఆన్‌లైన్ విద్యా బోధనతోపాటు పరీక్షలు, సెలవులు ఇతరత్రా అన్ని వివరాలను పొందుపరిచింది.

ఇదీ షెడ్యూల్..
1-12-2020: మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభం. తొలిరోజు ఓరియెంటేషన్.
1-12-2020 నుంచి 23-1-2021 వరకు..: మొదటి విడత విద్యా బోధన (8 వారాలు)
25-1-2021 నుంచి 30-1-2021 వరకు..: మిడ్ టర్మ్ పరీక్షలు
12-2-2021: పేరెంట్ టీచర్ మీటింగ్
1-2-2021 నుంచి 27-3-2021 వరకు..: రెండో విడత విద్యా బోధన (8 వారాలు)
29-3-2021 నుంచి 6-4-2021 వరకు..: రెండో మిడ్ టర్మ్ పరీక్షలు
7-4-2021 నుంచి 12-4-2021 వరకు..: ప్రాక్టికల్ పరీక్షలు, సెమిస్టర్ పరీక్షలకు ప్రిపరేషన్ సెలవులు
15-4-2021 నుంచి 29-4-2021 వరకు..: సెమిస్టర్ పరీక్షలు
30-4-2021 నుంచి 24-6-2021 వరకు..: రెండో సెమిస్టర్ మొదటి విడత విద్యా బోధన
25-6-2021 నుంచి 30-6-2021 వరకు: మిడ్ టర్మ్ పరీక్షలు
1-7-2021 నుంచి 25-8-2021 వరకు: రెండో విడత విద్యా బోధన
26-8-2021 నుంచి 1-9-2021 వరకు: మిడ్ టర్మ్ పరీక్షలు
2-9-2021 నుంచి 8-9-2021 వరకు: ప్రాక్టికల్ పరీక్షలు, సెమిస్టర్ పరీక్షల ప్రిపరేషన్ సెలవులు
9-9-2021 నుంచి 22-9-2021 వరకు: రెండో సెమిస్టర్ పరీక్షలు.
Published date : 24 Nov 2020 02:05PM

Photo Stories