Skip to main content

ఇంజనీరింగ్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం: ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ

గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీలోని ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇంటర్ పూర్తయి.. ఎంసెట్ ర్యాంకులు కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్.త్రిమూర్తులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
బీటెక్ (వ్యవసాయ ఇంజనీరింగ్), బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) కోర్సులకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. రెండింటికీ కలిపి ఉమ్మడి ప్రవేశ పత్రం (ఎంపీసీ-ఫారం బీ, బైపీసీ-ఫారం ఏ) ద్వారా రైతు కోటా కింద దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏఎన్‌జీఆర్‌ఏయూ.ఏసీ.ఐఎన్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు పంపించాలని కోరారు. డిసెంబరు 2 వరకు మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. విద్యార్థులు టెన్త్, ఇంటర్ మార్కుల జాబితా, ఎంసెట్ హాల్‌టికెట్, కుల ధ్రువీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, టీసీ, ఫారం ఐ1, ఎకరం వ్యవసాయ భూమి ఉన్న విద్యార్థులు పట్టాదారు పాస్ పుస్తకం, 1బీ అడంగల్‌ను ఆన్‌లైన్‌లో స్కాన్ చేసి పంపాలని సూచించారు. ధ్రువపత్రాలను డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో పరిశీలిస్తామన్నారు.
Published date : 26 Nov 2020 01:31PM

Photo Stories