2021 నుంచి ‘గిరిజన ఇంజనీరింగ్’ అడ్మిషన్లు
Sakshi Education
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): గిరిజన విద్యార్థులకు సాంకేతిక విద్య అందించడమే లక్ష్యంగా విజయనగరం జిల్లా కురుపాంలో ఏర్పాటు చేయనున్న ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణ పనులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించినట్లు జేఎన్టీయూకే రిజిస్ట్రార్ డాక్టర్ సత్యనారాయణ డిసెంబర్ 5వ తేదీన తెలిపారు.
![](/sites/default/files/images/2020/12/07/student-Edcet.jpg)
భవన నిర్మాణాలు వచ్చే ఏడాదిలోగా పూర్తి చేసి, 2021-22 నుంచి ఈసీఈ, సీఎస్ఈ, సివిల్, మెకానికల్, ఈఈఈ బ్రాంచిలలో తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కళాశాల జేఎన్టీయూ-కాకినాడకు అనుబంధంగా పనిచేయనున్నట్లు చెప్పారు.
Published date : 07 Dec 2020 04:42PM