Skip to main content

2021 నుంచి ‘గిరిజన ఇంజనీరింగ్’ అడ్మిషన్లు

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): గిరిజన విద్యార్థులకు సాంకేతిక విద్య అందించడమే లక్ష్యంగా విజయనగరం జిల్లా కురుపాంలో ఏర్పాటు చేయనున్న ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణ పనులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించినట్లు జేఎన్‌టీయూకే రిజిస్ట్రార్ డాక్టర్ సత్యనారాయణ డిసెంబర్ 5వ తేదీన తెలిపారు.
భవన నిర్మాణాలు వచ్చే ఏడాదిలోగా పూర్తి చేసి, 2021-22 నుంచి ఈసీఈ, సీఎస్‌ఈ, సివిల్, మెకానికల్, ఈఈఈ బ్రాంచిలలో తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కళాశాల జేఎన్‌టీయూ-కాకినాడకు అనుబంధంగా పనిచేయనున్నట్లు చెప్పారు.
Published date : 07 Dec 2020 04:42PM

Photo Stories