Skip to main content

Tennis: ఒస్ట్రావా ఓపెన్‌లో డబుల్స్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్న జోడి?

Sania Mirza-Shuai Zhang

భారత మహిళా టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా 2021 ఏడాది తన ఖాతాలో తొలి డబుల్స్‌ టైటిల్‌ను జమ చేసుకుంది. చెక్‌ రిపబ్లిక్‌లోని ఒస్ట్రావా నగరంలో సెప్టెంబర్‌ 26న ముగిసిన ఒస్ట్రావా ఓపెన్‌ మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ)–500 టోర్నీలో చైనా భాగస్వామి ష్వై జాంగ్‌తో కలిసి సానియా విజేతగా నిలిచింది. ఫైనల్లో రెండో సీడ్‌ సానియా–ష్వై జాంగ్‌ ద్వయం 6–2, 6–2తో మూడో సీడ్‌ కైట్లిన్‌ క్రిస్టియన్‌ (అమెరికా)–ఎరిన్‌ రౌట్లిఫ్‌ (న్యూజిలాండ్‌) జంటపై విజయం సాధించింది. విజేతగా నిలిచిన సానియా –ష్వై జాంగ్‌ జోడీకి 25,230 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 18 లక్షల 62 వేలు)తోపాటు 470 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

తాజా విజయంతో 34 ఏళ్ల సానియా తన కెరీర్‌లో 43వ డబుల్స్‌ టైటిల్‌ను సాధించింది. చివరిసారి 2020 జనవరిలో హోబర్ట్‌ ఓపెన్‌లో నాదియా కిచెనోక్‌ (ఉక్రెయిన్‌)తో కలిసి టైటిల్‌ నెగ్గిన సానియా ఖాతాలో చేరిన మరో డబుల్స్‌ టైటిల్‌ ఇదే.

చ‌ద‌వండి: 6 రెడ్స్‌ స్నూకర్‌ టోర్నీలో విజేతగా నిలిచిన భారతీయుడు?


క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఒస్ట్రావా ఓపెన్‌ మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ)–500 టోర్నీలో డబుల్స్‌ టైటిల్‌ గెలిచిన జోడి?
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 25
ఎవరు    : సానియా మీర్జా(భారత్‌), ష్వై జాంగ్‌(చైనా)
ఎక్కడ    : ఒస్ట్రావా, చెక్‌ రిపబ్లిక్‌
ఎందుకు  : ఫైనల్లో రెండో సీడ్‌ సానియా–ష్వై జాంగ్‌ ద్వయం 6–2, 6–2తో మూడో సీడ్‌ కైట్లిన్‌ క్రిస్టియన్‌ (అమెరికా)–ఎరిన్‌ రౌట్లిఫ్‌ (న్యూజిలాండ్‌) జంటపై విజయం సాధించినందున...

Published date : 27 Sep 2021 02:53PM

Photo Stories