Skip to main content

Chess Olympiad 2022: చెన్నైలో ప్రారంభించిన ప్రధాని మోదీ

44వ చెస్‌ ఒలంపియాడ్‌ ప్రపంచ స్థాయి పోటీలను చెన్నైలో ప్రధాని నరేంద్ర మోదీ జూలై 28న ప్రారంభించారు.
PM Modi to launch schemes
PM Modi to launch schemes

భారత్ తొలిసారి ఆతిథ్యమిస్తున్న ఈ పోటీల ప్రారంభ వేడుకలు చెన్నైలోని నెహ్రూ ఇండోర్‌స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగాయి. వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు ర్యాలీగా సాగారు. జాతీయగీతం, తమిళ్‌తాయ్‌ వాళ్తు గీతాలను ఆలపించారు. చెస్‌ ఒలంపియాడ్‌ టార్చ్‌ను గ్రాండ్‌మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ వేదికపైకి తీసుకురాగా ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్‌ అందుకున్నారు. 

also read: Weekly Current Affairs (Sports) Bitbank: పురుషుల హాకీ ఆసియా కప్ 2022ను ఏ జట్టు గెలుచుకుంది?

భారత్‌లోని చెన్నై వేదికగా జరుగుతున్న 44వ చెస్‌ ఒలింపియాడ్‌ నుంచి పాకిస్తాన్ వైదొలిగింది. ఈ నెల జూలై 21 జమ్మూ కశ్మీర్‌లో ఒలింపియాడ్‌కు సంబంధించిన ‘టార్చ్‌ రిలే’ మొదలైంది. అయితే దీనిపై పాకిస్తాన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజాగా ఆఖరి నిమిషంలో టోర్నీని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారి అరిందమ్‌ బాగ్చి అసహనం వ్యక్తం చేశారు. ‘జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగం.  పక్కదేశానికి అభ్యంతరమేంటి? అయినా ప్రతిష్టాత్మక క్రీడల్లో ఆడేందుకువచ్చి రాజకీయ రగడ చేయడం విచారకరం’ అని అన్నారు.
 

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 01 Aug 2022 03:17PM

Photo Stories