Skip to main content

Badminton: ఇండియా ఓపెన్‌–2022కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం?

PV SIndhu

రెండేళ్లుగా కోవిడ్‌ పడగ విప్పడంతో రద్దయిన ‘ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ సూపర్‌–500’ టోర్నమెంట్‌ 2022 ఏడాది నిర్వహణకు సిద్ధమైంది. దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా జనవరి 11న ప్రారంభమయ్యే ఈ మేటి ఈవెంట్‌ జనవరి 16న ముగియనుంది. భారత్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ క్రియాశీలం కావడంతో థర్ట్‌ వేవ్‌ (కోవిడ్‌ మూడో ముప్పు) ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే టోర్నీని నిర్వహించనున్నారు.

టోర్నీలో పాల్గొననున్న ప్రముఖ ఆటగాళ్లు..

  • 2017 ఇండియా ఓపెన్‌ విజేత పీవీ సింధు 
  • 2015 ఇండియా ఓపెన్‌ చాంపియన్‌ కిడాంబి శ్రీకాంత్‌
  • ప్రపంచ పురుషుల చాంపియన్‌ లో కియన్‌ వీ (సింగపూర్‌)
  • మలేసియా టాప్‌స్టార్స్‌ ఒంగ్‌ వి సిన్, టియో యి యి
  • ఇండోనేసియా చాంపియన్లు మొహమ్మద్‌ అసాన్, హెండ్రా సెతివాన్‌

మయాంక్‌ అగర్వాల్‌ ఏ క్రీడకి చెందినవాడు?

ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ (2021, డిసెంబర్‌)గా న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ ఎజాజ్‌ పటేల్‌ ఎంపికయ్యాడు. భారత్‌తో జరిగిన ముంబై టెస్టులో ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసి టెస్టు చరిత్రలో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా నిలిచిన ఎజాజ్‌... 2021, డిసెంబర్‌ నెలలో మొత్తం 14 వికెట్లు పడగొట్టాడు. ఈ అవార్డు కోసం ఎజాజ్‌తో పాటు ఆస్ట్రేలియా పేస్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్, భారత ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ పోటీ పడ్డారు.

చ‌ద‌వండి: మెల్‌బోర్న్‌ సమ్మర్‌ సెట్‌ టోర్నీ చాంపియన్‌?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి   :
2022 ఏడాది ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ సూపర్‌–500 టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం?
ఎప్పుడు : జనవరి 11
ఎవరు    : న్యూఢిల్లీ
ఎక్కడ    : ఇందిరాగాంధీ స్టేడియం, న్యూఢిల్లీ

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 11 Jan 2022 01:26PM

Photo Stories