Skip to main content

AP Infra Projects: 9 ప్రాజెక్టులు(రూ.15,233 కోట్లు)లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రధాని మోదీ

దొండపర్తి (విశాఖ దక్షిణ): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్ 12న ఉదయం ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.
PM Modi to launch, lay foundation stone for infra projects
PM Modi to launch, lay foundation stone for infra projects

ఇదే వేదికపై నుంచి రూ.15,233 కోట్లు విలువైన 9 ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపనలుప్రారంభోత్సవాలు చేయనున్నారు.  

శంకుస్థాపనల ప్రాజెక్టులు..

  • రూ.7,614 కోట్లు విలువైన 5 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. వాటిలో..  
  •   రూ.152 కోట్లతో విశాఖపట్నం  ఫిషింగ్‌ హార్బర్‌ ఆధునీకరణ. 
  • రూ.3,778 కోట్లతో రాయ్‌పూర్‌– విశాఖపట్నం 6 లేన్ల గ్రీన్‌ఫీల్డ్‌ హైవే, ఎకనామిక్‌ కారిడార్‌. 
  • రూ.566 కోట్లతో కాన్వెంట్‌ జంక్షన్‌ నుంచి షీలానగర్‌కు ప్రత్యేకమైన రోడ్డు. 
  • రూ.460 కోట్లతో విశాఖపట్నం  రైల్వేస్టేషన్‌ అభివృద్ధి. 
  • రూ.2,658 కోట్లతో 321 కిలో మీటర్ల శ్రీకాకుళం–అంగుల్‌కు గెయిల్‌ పైప్‌లైన్‌ ప్రాజెక్టులు ఉన్నాయి.  

Also read: E-Mobility week celebration: హైదరాబాద్‌ నగరంలో ఈ-మొబిలిటీ వారోత్సవాలు

జాతికి అంకితంచేసే ప్రాజెక్టులు 

  1. రూ.7,619 కోట్లతో పూర్తి చేసిన నాలుగు ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. వాటిలో 
  2. రూ.211 కోట్ల వ్యయంతో పాతపట్నం– నరసన్నపేటను కలుపుతూ నిర్మించిన నూతన జాతీయ రహదారి. 
  3. రూ.2,917 కోట్లతో తూర్పు తీరంలో అభివృద్ధి చేసిన ఓఎన్‌జీసీ యు–ఫీల్డ్‌. 
  4. రూ.385 కోట్లతో గుంతకల్‌లో ఐవోసీఎల్‌ గ్రాస్‌ రూట్‌ పీవోఎల్‌ డిపో నిర్మాణం. 
  5. రూ.4,106 కోట్లతో విజయవాడ– గుడివాడ–భీమవరం–నిడదవోలు, గుడివాడ–మచిలీపట్నం, భీమవరం– నరసాపురం (221 కి.మీ.) రైల్వే లైన్‌ ఎలక్ట్రిఫికేషన్‌ ఉన్నాయి.

Also read: Electric Double Deckers: భాగ్యనగరానికి 10 విద్యుత్‌ డబుల్‌ డెక్కర్‌లు

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 10 Nov 2022 03:45PM

Photo Stories