AP Infra Projects: 9 ప్రాజెక్టులు(రూ.15,233 కోట్లు)లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రధాని మోదీ
Sakshi Education
దొండపర్తి (విశాఖ దక్షిణ): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్ 12న ఉదయం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.
PM Modi to launch, lay foundation stone for infra projects
ఇదే వేదికపై నుంచి రూ.15,233 కోట్లు విలువైన 9 ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపనలుప్రారంభోత్సవాలు చేయనున్నారు.
శంకుస్థాపనల ప్రాజెక్టులు..
రూ.7,614 కోట్లు విలువైన 5 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. వాటిలో..
రూ.152 కోట్లతో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ.
రూ.3,778 కోట్లతో రాయ్పూర్– విశాఖపట్నం 6 లేన్ల గ్రీన్ఫీల్డ్ హైవే, ఎకనామిక్ కారిడార్.
రూ.566 కోట్లతో కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్కు ప్రత్యేకమైన రోడ్డు.
రూ.460 కోట్లతో విశాఖపట్నం రైల్వేస్టేషన్ అభివృద్ధి.
రూ.2,658 కోట్లతో 321 కిలో మీటర్ల శ్రీకాకుళం–అంగుల్కు గెయిల్ పైప్లైన్ ప్రాజెక్టులు ఉన్నాయి.