Skip to main content

APIIC: రాష్ట్రంలోని ఏ జిల్లాలో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయనున్నారు?

Industrial Park

ఆటోమొబైల్, ఇంజినీరింగ్‌ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తమిళనాడు రాష్ట్రానికి సమీపంలో చిత్తూరు జిల్లా కోశలనగరం వద్ద పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏపీఐఐసీ) నిర్ణయించింది. చెన్నై, తిరుపతి, చిత్తూరు నగరాలకు దగ్గరగా ఉండే విధంగా సుమారు 2,300 ఎకరాల్లో ఏపీఐఐసీ అభివృద్ధి చేసే ప్రతిపాదిత పారిశ్రామిక పార్కుకు తాజాగా పర్యావరణ అనుమతులు లభించాయి. ఈ పారిశ్రామిక పార్కు ద్వారా రూ.15 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, 17 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని ప్రాథమికంగా అంచనా వేశారు.

చ‌ద‌వండి: ఇటీవల 144 ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లను ప్రారంభించిన రాష్ట్రం?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి   :
పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయాలని నిర్ణయం
ఎప్పుడు : జనవరి 11
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏపీఐఐసీ)
ఎక్కడ    : కోశలనగరం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు : ఆటోమొబైల్, ఇంజినీరింగ్‌ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 11 Jan 2022 04:11PM

Photo Stories