Skip to main content

AP CM YS Jagan Mohan reddy: కొప్పర్తి పారిశ్రామికవాడలో 75 వేల మందికి ఉపాధి కల్పించేలా ప్రణాళిక

వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తిలో పారిశ్రామిక విప్లవం సృష్టిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.
AP CM YS Jagan Mohan Reddy
AP CM YS Jagan Mohan Reddy

ఇందులో భాగంగా సుమారు 75 వేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి క‌ల్పించే ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. రాయలసీమ రూపురేఖలు మారుతాయని స్పష్టం చేశారు. మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా తొలిరోజు గురువారం(డిసెంబర్‌ 23వ తేదీన) ఆయన ప్రొద్దుటూరు, గోపవరం, కొప్పర్తిలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. తొలుత రూ.515.90 కోట్లతో ప్రొద్దుటూరులో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత గోపవరం మండలంలో రూ.800 కోట్లతో ఏర్పాటు చేయనున్న సెంచురీ ప్లైవుడ్‌ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. సాయంత్రం కడప సమీపంలోని కొప్పర్తిలో వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ (ఎంఐహెచ్‌), వైఎస్సార్‌ ఎల్రక్టానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ (ఈఎంసీ)లను ప్రారంభించారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు, పలు కంపెనీల ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలనుద్దేశించి మాట్లాడారు. 540 ఎకరాల్లో ఎల్రక్టానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్, మరో 3,167 ఎకరాల్లో మెగా ఇండ్రస్టియల్‌ హబ్‌ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ రెండింటిలో రూ.1,580 కోట్లతో వసతులు కలి్పస్తున్నామన్నారు. రోడ్లు, విద్యుత్‌ సరఫరా, ఫ్యాక్టరీ షెడ్ల నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే రూ.100 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఇక్కడ నిర్మించిన నాలుగు షెడ్లలో ఇప్పటికే ఈఐఎల్‌ డిక్సన్‌ టెక్నాలజీస్‌ సంస్థ ఏర్పాటైందని, ఏప్రిల్‌ నాటికి 1800 మందికి ఉపాధి కలి్పస్తుందని స్పష్టం చేశారు.

సీఎం ఇంకా ఏం చెప్పారంటే..  
మరెన్నో సంస్థలు.. 
– మరో ఆరు ఎలక్ట్రానిక్‌ సంస్థలు గ్రౌండ్‌ బ్రేకింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో మొదటిది ఈఐఎల్‌ డిక్సన్‌ టెక్నాలజీస్‌. రెండవది డిజికాన్‌ సొల్యూషన్స్‌ ఎల్‌ఎల్‌పీ. మూడవది సెలకాన్‌ రెజుల్యూట్‌ సంస్థ. నాలుగవది చంద్రహాస్‌ ఎంటర్‌ప్రైజెస్, ఐదవది యూటీఎస్‌పీఎల్‌. ఆరవది డిక్సన్‌ రెండవ ప్లాంట్‌.  
– ఈ ఆరు సంస్థలు దాదాపు రూ.600 కోట్ల పెట్టుబడులకు సిద్ధమయ్యాయి. ఇందుకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించాం. ఈ పరిశ్రమల ద్వారా ఆరు నుంచి తొమ్మిది నెలల్లో దాదాపు 7,500 ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది. 
– వీవీడీఎన్‌ అనే మరో సంస్థ కూడా ఇక్కడ రూ.365 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమైంది. ఈ ఒక్క సంస్థ ద్వారానే 6,400 ఉద్యోగాలు రాబోతున్నాయి. ఆరు నుంచి తొమ్మిది నెలల్లోనే ఇది కార్యరూపం దాలుస్తుంది. బ్లాక్‌ పెప్పర్, హార్మోనిసిటీ అనే మరో రెండు ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఐఏటీ డివైజ్‌లు, ట్యాబ్లెట్స్‌ తయారీ ఈ పార్కులోనే జరగబోతోంది. 
 
రాయలసీమ రూపురేఖలు మార్చేలా.. 
– వీవీడీఎన్‌ సంస్థ 5జీ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, బ్లాక్‌ చైన్, బిగ్‌డేటా, ఎనలిటిక్, ఒరిజినల్‌ డిజైన్, మ్యానిఫ్యాక్చరింగ్‌ చేయబోతోంది. ఇదే పార్కులో మరో 18 ఎంఎస్‌ఎంఈల ప్రారంభానికి కూడా శిలాఫలకాలు వేస్తున్నాం.  
– రాయలసీమ ఎన్విరాన్‌కేర్, బీఎస్‌ ల్యా»ొరేటరీ, స్వర్ణముఖి కాంక్రీట్‌ రూ.84 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి. వీటి ద్వారా మరో 1,200 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతున్నాయి. పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగిన తర్వాత ఇక్కడ 75 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. 
– చదువుకున్న మన పిల్లలకు మన జిల్లాలోనే ఉద్యోగ అవకాశాలు రావాలని, మొత్తం రాయలసీమ ప్రాంతానికి మంచి జరుగుతుందని అడుగులు ముందుకు వేస్తున్నాం. ఒకవైపు కొప్పర్తి, మరొకవైపు నెల్లూరు, చిత్తూరు సరిహద్దుల్లోని శ్రీసిటీ.. రాయలసీమ రూపురేఖలు మార్చేందుకు ఉపయోగపడతాయి. వీటి వల్ల ఇంకా మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నా. 
 
సెంచురీ ఫ్లై వుడ్‌తో 6 వేల మందికి ఉపాధి .. 
– వెనుకబడిన ప్రాంతమైన బద్వేలు నియోజకవర్గంలోని గోపవరంలో ఏర్పాటు చేయనున్న పరిశ్రమతో యువతకు ఉపాధి, రైతుల ప్లాంటేషన్‌కు గిట్టుబాటు ధర లభిస్తుంది. దేశంలోనే అతి పెద్దదైన వుడ్‌ పరిశ్రమ బద్వేలులో ఏర్పాటు చేయడం చాలా సంతోషించ‌ దగ్గ విషయం. 
– దీంతో ప్రత్యక్షంగా రెండు వేల మందికి, పరోక్షంగా నాలుగు వేల మందికి ఉపాధి దొరుకుతుంది. వైఎస్సార్, ప్రకాశం, నెల్లూరు జిల్లా రైతులు సాగు చేస్తున్న సుబాబుల్‌ కర్రలకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుంది. వ్యవసాయ హబ్‌తో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశముంది. తద్వారా ఉద్యోగావకాశాలు మెరుగు పడతాయి. 
– రైతులు సైతం తమ భూములు ఇచ్చి పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు రావడం గొప్ప విషయం. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చిన సెంచురీ ఫ్లై బోర్డ్స్‌ లిమిటెడ్‌ (పీసీఐఎల్‌) యాజమానులు సజ్జన్‌ భజాంక, సంజయ్‌ అగర్వాల్‌కు కృతజ్ఞతలు. 
– బద్వేలు నియోజకవర్గంలో ఇప్పటికే రూ.500 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వీటితో పాటు ప్రస్తుతం రూ.6 కోట్లతో ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటుకు శంకుస్థాపన చేశాం. కాశినాయన మండల కేంద్రంలో నూతనంగా పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో బద్వేలు ప్రాంతంలో మరింత అభివృద్ధి జరుగుతుంది. 

Published date : 24 Dec 2021 05:49PM

Photo Stories