Skip to main content

Trade Conference: యాంబిషన్‌ ఇండియా సదస్సులో ప్రసగించిన నేత?

KTR at France


ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లోని ఫ్రెంచ్‌ సెనేట్‌లో అక్టోబర్‌ 29న జరిగిన ‘యాంబిషన్‌ ఇండియా 2021’ వాణిజ్య సదస్సులో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు కీలకోపన్యాసం చేశారు. సెనేట్‌ సభ్యులతో పాటు స్థానిక వాణిజ్య, రాజకీయ వర్గాల ప్రముఖులు పాల్గొన్న ఈ సదస్సులో, ‘కోవిడ్‌ తదనంతర కాలంలో భారత్‌–ఫ్రెంచ్‌ సంబంధాల భవిష్యత్తుకు కార్యాచరణ’అంశంపై మంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో ఏడేళ్లుగా తెలంగాణ రాష్ట్రం అనుసరిస్తున్న ప్రగతిశీల విధానాలు, సాధించిన అభివృద్ధిని వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాల్సిందిగా ఫ్రెంచ్‌ పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. పారిస్‌లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌ ‘క్యాంపస్‌ స్టేషన్‌ ఎఫ్‌’ను కూడా కేటీఆర్‌ సందర్శించారు. 

భారత్, ఫ్రాన్స్‌ మధ్య వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమాన్యుయేల్‌ మాక్రాన్‌ చొరవతో ‘యాంబిషన్‌ ఇండియా 2021’సదస్సును ఏర్పాటు చేశారు. ఫ్రాన్స్‌ రాయబారి ఎమాన్యుయేల్‌ లెనైన్‌ ఆహ్వానం మేరకు మంత్రి కేటీఆర్‌ సదస్సులో ప్రసంగించారు.
 

చ‌ద‌వండి: ఎన్‌బీఎఫ్‌ఐడీ చైర్మన్‌గా నియమితులైన ప్రముఖ బ్యాంకర్‌?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : యాంబిషన్‌ ఇండియా 2021 వాణిజ్య సదస్సులో ప్రసంగం
ఎప్పుడు : అక్టోబర్‌ 29
ఎవరు    : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు
ఎక్కడ    : ఫ్రెంచ్‌ సెనేట్, పారిస్, ఫ్రాన్స్‌
ఎందుకు : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల అవకాశాలను గురించి వివరించేందుకు...

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 30 Oct 2021 03:49PM

Photo Stories