Skip to main content

Srinivas Reddy: తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌గా పల్లెపహాడ్‌ వాసి

నార్కట్‌పల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ చైర్మనగా నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం పల్లెపహాడ్‌కు చెందిన సీనియర్‌ జర్నలిస్టు కల్మెకొలను శ్రీనివాస్‌రెడ్డి నియామకమయ్యారు.
Srinivas Reddy Appointed As Telangana Media Academy Chairman

ఈ మేరకు ప్రభుత్వం ఫిబ్ర‌వ‌రి 25వ తేదీ నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం ప్రజాప్రక్షం దిన పత్రికకు సంపాదకులుగా వ్యవహరిస్తున్న కల్మెకోలను శ్రీనివాస్‌రెడ్డి గతంలో ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా, ఐజేయూ (ఇండియన్‌ జర్నలిస్టు యూనియన్‌) సెక్రటరీ జనరల్‌గా కూడా పని చేశారు.
కల్మెకోలను అండమ్మ రాంరెడ్డి దంపతులకు ఆరుగురు సంతానంలో శ్రీనివాస్‌రెడ్డి పెద్దకుమారుడు. విద్యాభాసం పూర్తిగా నాగారం, సూర్యాపేట, హైదరాబాద్‌లోనే జరిగింది. శ్రీనివాస్‌రెడ్డికి భార్య భారతమ్మ, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడున్నారు.

Chairman of BBC: బీబీసీ చైర్మన్‌గా తొలిసారి భారతీయుడు.. రూ.1.68 కోట్ల వార్షిక వేతనం

Published date : 26 Feb 2024 05:09PM

Photo Stories