Skip to main content

Ramsahay Yadav: నేపాల్‌ ఉపాధ్యక్షుడిగా రాంసహాయ్‌ యాదవ్‌

నేపాల్‌ ఉపాధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన రాంసహాయ్‌ ప్రసాద్‌ యాదవ్‌(52) ఎన్నికయ్యారు.
Ramsahay Yadav

మార్చి 17న‌ జరిగిన ఎన్నికల్లో 8 పార్టీలతో కూడిన అధికార కూటమి అభ్యర్థి యాదవ్, సీపీఎన్‌–యూఎంఎల్‌ బలపరిచిన సమీప ప్రత్యర్థి అష్టలక్ష్మీ శాక్యను ఓడించారు. 2008లో నేపాల్‌ రిపబ్లిక్‌గా అవతరించాక మూడో ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన యాదవ్, ప్రస్తుత ఉపాధ్యక్షుడు నంద బహదూర్‌ పున్‌ స్థానంలో బాధ్యతలు చేపడతారు. నేపాల్‌ దక్షిణ ప్రాంతంలోని మాధేష్‌లో మెజారిటీ ప్రజలు భారత సంతతి వారే. మాధేషీలకు ప్రత్యేక హక్కుల కోసం 2007లో ఎగసిన ఉద్యమంలో యాదవ్‌ చురుకైన పాత్ర పోషించారు.

Ram Chandra Poudel: నేపాల్‌ కొత్త అధ్యక్షుడిగా పౌద్యాల్‌!

 

Published date : 18 Mar 2023 12:03PM

Photo Stories