Khushbu Sundar: ఎన్సీడబ్ల్యూ సభ్యురాలిగా ఖుష్బూ
Sakshi Education
ప్రముఖ సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్(52) జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) సభ్యురాలిగా నియమితులయ్యారు.
![Khushbu Sundar](/sites/default/files/images/2023/02/28/kushboo-1677578515.jpg)
బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలైన ఆమె ఫిబ్రవరి 27వ తేదీ ట్వీట్ చేశారు. ఆమెతో పాటు మేఘాలయకు చెందిన డెలినా ఖొంగ్డుప్, జార్ఖండ్వాసి మమతా కుమారి కూడా ఎన్సీడబ్ల్యూకు నామినేట్ అయ్యారు. సినీ నటి, నిర్మాత అయిన ఖుష్బూ తొలుత డీఎంకేలో, తర్వాత కాంగ్రెస్లో కొనసాగారు. బీజేపీలో చేరి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Persons) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)
Published date : 28 Feb 2023 03:31PM