Skip to main content

Dun & Bradstreet: డీఅండ్‌బీ సలహా బోర్డులో చేరిన ఎస్‌బీఐ మాజీ చైర్మన్‌?

Rajnish Kumar

బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మాజీ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌.. డేటా, అనలిటిక్స్‌ సంస్థ డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ (డీఅండ్‌బీ) సలహా బోర్డు (అంతర్జాతీయ వ్యూహాత్మక వ్యవహారాలు)లో చేరారు. ఈ మేరకు డీఅండ్‌బీ సంస్థ మార్చి 24న ఒక ప్రకటన విడుదల చేసింది. బ్యాంకింగ్‌లో విశేష అనుభవం ఉన్న రజనీష్‌.. ప్రస్తుతం హెచ్‌ఎస్‌బీసీ ఆసియా పసిఫిక్, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్, హీరో మోటోకార్ప్, భారత్‌ పే బోర్డుల్లో సభ్యులుగా ఉన్నారు. డీఅండ్‌బీ ప్రధాన కార్యాలయం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం, జాక్సన్‌విల్లే నగరంలో ఉంది.

UNCTAD: ఐరాస అంచనాల ప్రకారం.. భారత జీడీపీ వృద్ధి రేటు ఎంత?

ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్య సాధన దిశలో..
‘‘డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ భారతదేశంలో టెక్నాలజీ–ఆధారిత ఫైనాన్స్, రిస్క్, కంప్లైయన్స్, డేటా, మార్కెటింగ్‌ సొల్యూషన్‌ల ద్వారా లఘు, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ) సాధికారతకు తన వంతు ప్రయత్నం చేస్తోంది. రజ్‌నీష్‌ కుమార్‌ డిజిటల్‌ ఇండియా మిషన్‌లో విశేష అనుభవం పొందారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్య సాధన దిశలో మేము అయన మార్గదర్శకత్వం, దార్శనికత కోసం ఎదురుచూస్తున్నాము’’అని డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఇండియా) అవినాష్‌ గుప్తా అన్నారు.

India capability center: ప్రాట్‌ అండ్‌ విట్నీ కేపబిలిటీ సెంటర్‌ను ఎక్కడ ప్రారంభించనున్నారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ (డీఅండ్‌బీ) సలహా బోర్డులో చేరిన వ్యక్తి?
ఎప్పుడు : మార్చి 24
ఎవరు    : బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మాజీ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌
ఎందుకు : భారతదేశంలో ఎంఎస్‌ఎంఈల సాధికారతకు సంబంధించి డీఅండ్‌బీకు మార్గదర్శకత్వం వహించడానికి..

Published date : 25 Mar 2022 04:09PM

Photo Stories