Rajnath Singh Malaysia Tour: రాజ్నాథ్ సింగ్ మలేసియా పర్యటన
Sakshi Education
భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మూడు రోజుల మలేసియా పర్యటనలో భాగంగా రక్షణ, సాంకేతిక రంగాల్లో మరింత సహకారాన్ని పెంపొందించుకొనేందుకు వీలుగా 1993 నాటి కీలక అవగాహన ఒప్పందాన్ని(ఎంవోయూ) సవరించేందుకు భారత్, మలేసియా పరస్పరం అంగీకరించాయి
Rajnath Singh Malaysia Tour
ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం, పారిశ్రామిక రంగంలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు 1993 నాటి ఎంవోయూను సవరించేందుకు వీలుగా ఎక్ఛేంజ్ ఆఫ్ లెటర్పై సంతకాలు చేశారు. దీనివల్ల సైన్యంలోని మూడు విభాగాల్లోనూ రక్షణ ఉత్పత్తుల నిర్వహణ, మరమ్మతు తదితర అంశాల్లో ఇరు దేశాలు సహకరించుకోనున్నాయి. భారత్లో ఈ ఏడాది మలేసియా-భారత్ సహకార కమిటీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. మలేసియా రక్షణ రంగం స్వయంసమృద్ధికి సహకారం అందిస్తామని రాజ్నాథ్ భరోసా ఇచ్చారు.