Skip to main content

భద్రత రికార్డులను భద్రపరచండి: సుప్రీంకోర్టు

Supreme Court

పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 5న చేసిన పర్యటనలో భద్రతా వైఫల్యం ఘటన(ఫిరోజ్‌పూర్‌ ఘటన)కు సంబంధించి అన్ని రికార్డులను తక్షణమే భద్రపరచాలని పంజాబ్‌ హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ను జనవరి 7న సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫిరోజ్‌పూర్‌ ఘటనపై లాయర్స్‌ వాయిస్‌ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను జనవరి 7న విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

చిత్తరంజన్‌ నేషనల్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఏ నగరంలో ఉంది?

పశ్చిమ బెంగాల్‌ రాజధాని నగరం కోల్‌కతాలో ఉన్న చిత్తరంజన్‌ నేషనల్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీఎన్‌సీఐ) రెండో క్యాంపస్‌ ప్రారంభమైంది. జనవరి 7న వర్చువల్‌ విధానం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ఈ క్యాంపస్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కూడా పాల్గొన్నారు.

గంగాసాగర్‌ మేళాను ఏక్కడ నిర్వహిస్తారు?

హిందువులు లక్షలాదిగా హాజరయ్యే గంగాసాగర్‌ మేళాకు కోల్‌కతా హైకోర్టు పచ్చజెండా ఊపింది. దేశంలో కరోనా వ్యాప్తి ఉధృతమవుతున్న వేళ ఈ మేళాను ఆపాలంటూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. బంగాళాఖాతంలో గంగానది కలిసే ద్వీప ప్రాంతంలో ఏటా గంగాసాగర్‌మేళా జరుగుతుంది. 2022, జనవరి 8నుంచి 17వ తేదీ వరకు కొనసాగే ఈ మేళా సమయంలో జనం నదీ స్నానాలు ఆచరించడంతోపాటు అక్కడి ఆలయాల్లో పూజలు నిర్వహిస్తుంటారు.

చ‌ద‌వండి: సరయూ కెనాల్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 09 Jan 2022 12:01PM

Photo Stories